అల్లూరి జిల్లాలో కలకలం.. Mro ఆత్మహత్య వెనుక?

by Disha Web Desk 16 |
అల్లూరి జిల్లాలో కలకలం.. Mro ఆత్మహత్య వెనుక?
X

దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి జిల్లాలో ఓ తహసీల్దార్‌ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పెదబయలు మండలం తహసీల్దార్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం పైగదిలో ఉంటున్న ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. గురువారం ఆయన గదికి వెళ్లిన సిబ్బంది ఆయనను పిలిచినా ఆయన నుంచి స్పందన లేకపోవడంతో గది కిటికి నుంచి పరిశీలించారు. తహసీల్దార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించారు. దీంతో సిబ్బంది ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తహసీల్దార్‌ మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.


Next Story