- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Ap News: ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
by srinivas |
![Ap News: ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య Ap News: ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య](https://www.dishadaily.com/h-upload/2023/10/29/275444-tra.webp)
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్ సిగ్నల్ కోసం ఆగింది. అదే ట్రాక్పై వచ్చిన పలాస ఎక్స్ప్రెస్ విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story