Ap News: ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

by srinivas |
Ap News: ఘోర రైలు ప్రమాదం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్ సిగ్నల్ కోసం ఆగింది. అదే ట్రాక్‌పై వచ్చిన పలాస ఎక్స్‌ప్రెస్ విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో విశాఖ-రాయగడ ప్యాసింజర్ ట్రైన్‌ మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహయక చర్యలు కొనసాగుతున్నాయి.



Next Story

Most Viewed