AP Politics:ఇక్కడే చదివా..ఈ వీధుల్లోనే తిరిగా:బొత్స ఝాన్సీ

by Jakkula Mamatha |
AP Politics:ఇక్కడే చదివా..ఈ వీధుల్లోనే తిరిగా:బొత్స ఝాన్సీ
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ఇక్కడే కమలా నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ లో చదువుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఈ వీధుల్లో ఎన్నికల ప్రచారం చేయడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి కష్టపడి పనిచేస్తా అని విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం అచ్చియ్యమ్మ పేట, కొబ్బరితోట 75 ఫీట్ రోడ్, రామకృష్ణ జంక్షన్ లలో బుధవారం వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధాని అయితే ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు.గతంలో ఎంపీగా పనిచేసినప్పుడే విశాఖ ప్రగతి కోసం పనిచేసానని ఈసారి విశాఖ ఎంపీగా ఎన్నుకుంటే మరింతగా పుట్టినిల్లయిన విశాఖ కోసం పనిచెస్థానన్నారు.కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కోలా గురువులు, వైఎస్సార్సీపీ పరిశీలకులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ, కార్పొరేటర్ పద్మావతి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.



Next Story

Most Viewed