సభా ప్రాంగణానికి చేరుకున్న PM Modi

by Disha Web Desk 10 |
సభా ప్రాంగణానికి చేరుకున్న PM Modi
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో AU ఇంజినీరింగ్ కాలేజ్ వచ్చారు. సభా వేదికకు ముందుగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేరుకొని ప్రధానికి మోదీకు స్వాగతం పలికారు. రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నమూనాలను పరిశీలించారు.

విశాఖలో నిర్వహించే సభలో ప్రధాని మోదీ దాదాపు 40 నిమిషాలు ప్రసంగించనున్నారు. మోదీ ఏమి మాట్లాడతారా అనేది ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రి వై.యస్ జగన్‌కు 7 నిమిషాల సమయం కేటాయించనున్నారు.ప్రధాని మోదీ సభా వేదిక పై తొమ్మిది మందికి అనుమతి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.15,000 వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు.



Next Story

Most Viewed