AnakapallI: ఒడ్డిమెట్ట ఆలయానికి 125 కేజీ లడ్డూ అందజేత

by srinivas |
AnakapallI: ఒడ్డిమెట్ట ఆలయానికి 125 కేజీ లడ్డూ అందజేత
X

దిశ, ఉత్తరాంధ్ర: వినాయక చవితి పండుగ సందర్భంగా తునికి చెందిన భక్తుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట లక్ష్మీ గణపతి ఆలయానికి 125 కేజీల లడ్డూ ప్రసాదం అందజేశారు. 9 రోజుల పాటు పూజల చేసిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఈ లడ్డూప్రసాదాన్ని వేలం వేస్తామని ఆలయ ఈవో వెంకటాద్రి తెలిపారు. పెద్ద సైజులో ఉన్న ఈ లడ్డూ ప్రసాదాన్ని చూసిన భక్తులు ఆశ్చర్య పోతున్నారు. మరి కొంతమంది భక్తులు చిన్న సైజుల్లో కూడా లడ్డూలు ఆలయానికి అందజేశారు.



Next Story

Most Viewed