ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్, ముగ్గురి పరిస్థితి విషమం

by Disha Web Desk 16 |
ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్, ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలి వాహ‌నం బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు మద్దికేరకి చెందిన మహిళలుగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే రెప్పపాటులో ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. డ్రైవర్ వాహనాలు నడిపేసమయంలో కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించారు. నిషేధిత పదార్థాలను రవాణా చేయొద్దని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



Next Story

Most Viewed