- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కిన టీడీపీ మహిళా నేత
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ టీడీపీ మహిళా నేత మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్టు ఎక్కారు. తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి మోకాళ్లతో ఇంద్రకీలాద్రి మెట్లెక్కారు. అనంతరం కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పూర్తిఅవ్వాలని కోరుకుంటూ మోకాళ్లపై ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కి మెట్లపూజ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, అంగన్వాడీ విభాగం రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బొప్పన నీరజ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఉదయశ్రీ, టీడీపీ నాయకులు పెందుర్తి శ్రీకాంత్, మహిళలు, పాల్గొన్నారు.