Breaking: ఎస్సీలకు చంద్రబాబు సంచలన హామీ

by srinivas |
Breaking: ఎస్సీలకు చంద్రబాబు సంచలన హామీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎస్సీలకు టీడీపీ అధినేత చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజాగళం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీలకు ఎన్నికల హామీలు ప్రకటించారు. ఎస్సీలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని చెప్పారు. సబ్ అమలు చేసి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సంపద పెంచి ప్రజలకు పంచుతామన్నారు. పేదరికం లేని సమాజాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అన్ని వర్గాలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వైసీపీ నాయకులు సహజ వరులను దోచుకున్నారని మండిపడ్డారు. ఆక్వా రంగాన్ని మళ్లీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందన్నారు. ధాన్యం విక్రయించాలంటే ఎదురు డబ్బులు ఇచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ద్రోహం చేయడం వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.



Next Story

Most Viewed