'అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1'

by Disha Web Desk 16 |
అప్పుల్లో దేశంలోనే ఏపీ నంబర్ 1
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అన్ని వ్యవస్థలను మోసం చేస్తున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అప్పుల విషయంలో కేంద్రాన్ని.. కాగ్‌ను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టులను సైతం మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్నిటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లు వేసిన ప్రజలనే మోసం చేస్తున్నారని ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. 'ప్రజల ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిపై లక్షలాది రూపాయల అప్పు పెట్టి పోయిన జగన్ రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే.' అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.

ఇవి కూడా చదవండి:

Mangalagiri టీడీపీకి షాక్.. వైసీపీలోకి భారీగా వలసలు



Next Story

Most Viewed