ఇంటర్ పరీక్షల్లో విషాదం : పరీక్ష కేంద్రంలోనే విద్యార్థి మృతి

by Dishanational2 |
ఇంటర్ పరీక్షల్లో విషాదం :  పరీక్ష కేంద్రంలోనే  విద్యార్థి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పరీక్ష కేంద్రంలోనే విద్యార్థి మృతి చెందిన ఘటన తిరుపతి జిల్లా మంగళ వారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. రోజులాగే సైదాపూర్‌కు చెందిన సతీష్ పరీక్ష రాయడానికి జిల్లాలోని గూరులో డీఆర్ డబ్ల్యూ కేంద్రానికి వచ్చాడు . అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన పరీక్ష కేంద్రంలో కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే అతని వద్దకు వెళ్లి చూడగా స్ప్రోహ కోల్పోయాడని, వైద్యులకు సమాచారం అందించారు. వైద్యులు అతడిని పరీక్షించగా అప్పటికే సతీష్ చనిపోయినట్లు ధృవీకరించారు. దీంతో ఒక్కసారిగా పరీక్ష కేంద్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. తమతో పరిక్ష రాయడానికి వచ్చిన తన మిత్రుడు ఇక లేడనే వార్త విన్న విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed