చచ్చే వరకు ఆయనతోనే ఉంటా.. Posani Krisha Muarli సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
చచ్చే వరకు ఆయనతోనే ఉంటా.. Posani Krisha Muarli సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సినీనటుడు పోసాని కృష్ణమురళి ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలిపారు. వైఎస్ జగన్ తనకు 11ఏళ్లుగా తెలుసునని ఆయన జనంలో నుంచి పుట్టిన నాయకుడు అని కొనియాడారు. సీఎం జగన్ తనకు పదవి ఇస్తారని అనుకోలేదని..ఆయనను దూరంగా చూస్తూ ఇష్టపడే వాడినని చెప్పారు. తనను రాజకీయాలకు పరిచయం చేసింది గౌతమ్ రెడ్డి అని తెలిపారు. కళామ్మతల్లికి సేవ చేసుకునే అదృష్టం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తన వల్ల సినీపరిశ్రమకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ కీడు మాత్రం చేయబోనని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీ విశాఖకు తరలించేందుకు కృషి చేస్తానని పోసాని కృష్ణ మురళి తెలిపారు.

అటు కళాతపస్వి కే విశ్వనాథ్, డైరెక్టర్ సాగర్ మృతికి పోసాని నివాళులర్పించారు. డైరెక్టర్ సాగర్, విశ్వనాథ్‌కు చాలా వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. సాగర్ మంచి మానతావాది అని, విశ్వనాథ్ గొప్ప డైరెక్టర్ అని పోసాని కొనియాడారు.


Next Story