గారలో దారుణం.. మంత్రి ధర్మానకు Cm Jagan ఫోన్

by Disha Web Desk 16 |
గారలో దారుణం.. మంత్రి ధర్మానకు Cm Jagan ఫోన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా గార వైస్ ఎంపీపీ బరాటం రామశేషు హత్యపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆదేశించారు. హత్య విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ మంత్రి ధర్మానకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకూర్మం వెళ్లారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన ప్రసాదరావు హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed