Janasenaకు అవకాశం ఇవ్వండి: గునుకుల కిషోర్

by Disha Web Desk 16 |
Janasenaకు అవకాశం ఇవ్వండి: గునుకుల కిషోర్
X

దిశ,నెల్లూరు: ఎన్నికలు దగ్గర పడేసరికి శంకుస్థాపనలు ఊపందుకుటున్నాయని జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ నిర్ణయం ఏదైనా ఒకసారి జనసేనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. కిషోర్ ఆధ్వర్యంలో మినీ బైపాస్ జ్యోతిరావులే బొమ్మ వద్ద నుంచి బాలాజీ నగర్ మెయిన్ రోడ్డు మీదగా సంక్రాంతి సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బకాయిలు చల్లించక రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టులు అంటేనే భయపడే పరిస్థితుల్లో ఉన్నారని కిషోర్ విమర్శించారు. ఆ నిధులు మళ్లించి వైసీపీ నాయకులకు కొత్త కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకుని అడ్డగోలుగా మాట్లాడడం తప్పిస్తే వైసీపీ ప్రభుత్వం సాధించిందేమి లేదని కిషోర్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed