- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉచితంగా ఖరీదైన వైద్యం అందిచడమే Arogya Sri లక్ష్యం!
- - ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. యాదాల అశోక్ బాబు
దిశ, నెల్లూరు: పేద ప్రజలు ఖరీదైన వైద్య సేవలు పొందే విషయంలో అప్పులపాలు కాకూడదనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. యాదాల అశోక్ బాబు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా నెల్లూరు విచ్చేసిన ఆయన ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న వైనంపై ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో గతంలో కేవలం 1057 వ్యాధులకు మాత్రమే అరకొరగా సేవనందించేవారని, ప్రస్తుతం 3225 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేదవానికి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. అదే విధంగా నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలల రూపురేఖలే మార్చి వేశారన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు అన్ని రకాల మౌలిక వసతులు, ఖరీదైన వైద్య పరికరాలు అందజేశారన్నారు. ఈ మూడేళ్లలోనే 40 వేల మందికి పైగా డాక్టర్లు, ఇతర సిబ్బందిని నియమించారన్నారు. వైద్య సేవలు అందించే విషయంలో పేద, ధనిక తారతమ్యాలు లేకుండా ఖరీదైన వైద్యం అందరికీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పధకం ద్వారా ఇప్పటివరకు 7 వేల కోట్లు ఖర్చు చేసి 34 లక్షల మందికి వైద్యసేవలు అందించామని యాదాల అశోక్ బాబు తెలిపారు.