- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Ap News: స్కిల్ స్కామ్ కేసు విచారణ మరోసారి వాయిదా
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ స్కామ్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రకాంత్ షా అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అయితే తాను అప్రూవర్గా మారినట్లు చంద్రకాంత్ షా విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఎదుట ఇరు వర్గాల వాదనలు వినిపించారు. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు వాయిదా కోరారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.
కాగా స్కిల్ డెవల్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి సెంట్రల్లో రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయింది. అయితే ఈ కేసులో 31వ నిందితుడిగా ఉన్న చంద్రకాత్ షా అప్రూవర్గా మారారు. ఇప్పటికే ఈ కేసులో ఆయన సెల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్స్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్లో సైంటిఫిక్ ఎనాలసిస్ కూడా సీఐడీ అధికారులు చేశారు.