Bapatla: బస్సులో వ్యక్తికి గుండె పోటు.. మృతుడి వద్ద 47 వజ్రాలు లభ్యం

by Disha Web Desk 16 |
Bapatla: బస్సులో వ్యక్తికి గుండె పోటు.. మృతుడి వద్ద 47 వజ్రాలు లభ్యం
X

దిశ వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద వ్యక్తికి గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అయితే అతని వద్ద కోటి రూపాయల విలువైన 47 వజ్రాలు లభ్యమయ్యాయి. మృతుడు పవన్‌గా గుర్తించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భీమవరానికి చెందిన వపన్.. గుంటూరు కిస్నా నగల షాపులో పని చేస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల నుంచి గుంటూరు వెళ్తుండగా పవన్‌కు గుండె పోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించేలోపే పవన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పవన్ మృతదేహాన్ని పరిశీలించారు. పవన్ వద్ద ఉన్న బ్యాగులో 47 వజ్రాలను స్వాధీనం చేసుకుని విచారణ జరిపి నగల షాపు యజమానికి అప్పగించారు. పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story