చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

by Disha Web Desk 16 |
చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోరనో ఏమో తెలీదు కానీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన అద్దంకిలో చోటు చేసుకుంది. స్థానిక గరటయ్య కాలనీ సమీపంలోని కాకాని కుంట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతులు అద్దంకి పట్టణానికి చెందిన పెద్దిరాజు (22), ప్రశాంతి (20) గా గుర్తించారు. అయితే మృతులు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమా లేక మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed