చంద్రబాబుకి మరోసారి పరాభవం తప్పదు..!

by Disha Web Desk 16 |
చంద్రబాబుకి మరోసారి పరాభవం తప్పదు..!
X
  • బంటరిగా పోటీ చేసే దమ్ము ఆ పార్టీలకు లేదు
  • కుటిల రాజకీయ పార్టీలకు రాష్ట్రంలో స్థానం ఉండదు
  • చంద్రబాబుకి పరాభవం తప్పదు
  • వైసీపీ నేత కరణం వెంకటేష్

దిశ, దక్షిణ కోస్తా: 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి మరోసారి పరాభవం తప్పదని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. కుటిల రాజకీయ పార్టీలకు ఈ రాష్ట్రంలో స్థానం లేదని తెలిపారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంతో వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఒంటరిగా పోటీ చేసే దమ్మూ, ధైర్యం టీడీపీ. జనసేన పార్టీలకు లేదన్నారు. చంద్రబాబు కుప్పంలో... లోకేష్‌ మంగళగిరిలో గెలిచే పరిస్థితి లేదని జోష్యం చెప్పారు. తండ్రీ కొడుకుల రాజకీయం ఇక ఉండదని విమర్శించారు. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నా చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎలాంటి అవగాహన, స్పష్టత లేని నాయకుడని విమర్శించారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అధికారం లేదన్న అక్కసుతో ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు, ఎవరెన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో జగన్‌ మళ్లీ అధికారం సాధిస్తారని వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed