- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఏపీలో ప్లాస్టర్ డే..ఒక చిన్న గులకరాయికి వారంగా ఇద్దరికి ప్లాస్టర్లా!
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: ఏపీలో సీఎం పై రాళ్లదాడి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో నుదిటిపై, కన్నుపై ప్లాస్టర్, బ్యాండేజీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేకంగా ప్లాస్టర్ డే, బ్యాండేజీ డే జరపాలంటూ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్లు విజయవాడ గులకరాయి ఘటన తరువాత ఇప్పటికీ ప్లాస్టర్లతో కనిపించడమే ఇందుకు కారణం. గులకరాయి దెబ్బ రోజు రోజుకూ తగ్గుతుందా? పెరుగుతుందా? ముఖ్యమంత్రి ప్లాస్టర్ సైజ్ ఎందుకు పెరుగుతుందంటూ ఒకటే సైటైర్లు.
అన్నింటికంటే దారుణంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక రోజు ఎడమ కంటికి , మరో రోజు కుడి కంటికి ప్లాస్టర్ వేసుకురావడం పై నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. ‘‘ మొన్న ఎడమ కన్నుకు బ్యాండేజ్ వేశారు. నిన్న కుడి కన్నుకి వేశారు. అద్దంలో చూసివేసుకున్నట్లున్నాడు బ్యాండేజ్ ’’ అంటూ వెల్లంపల్లి పై ఫోటోలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరొకరు మరింత ముందుకెళ్లి ‘‘ నీకు తగిలిన దెబ్బకు నువ్వు వేసుకొన్న బ్యాండేజీకి ఏమైనా సంబంధం ఉందా?’’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్జెంట్ గా ప్లాస్టర్ డే పాటించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఒ మైనర్ బాలుడు వేసిన గులకరాయికి ఒక సింగిల్ గా వచ్చే సింహం, సింహం లాంటి మరో వ్యక్తికి గాయమై, వారం రోజులైనా తగ్గకపోతే డే జరపాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు.