ప్రధాని నరేంద్ర మోడీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు

by Disha Web Desk 9 |
ప్రధాని నరేంద్ర మోడీపై పవన్ కల్యాణ్ ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానిపై, కేంద్ర ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ వీరుల త్యాగఫలంతో స్వతంత్రతను సాధించిన భారతావని సగర్వంగా వజ్రోత్సవాన్ని జరుపుకొంది. ఈ 75 వసంతాలలో ఎన్నో మార్పులు.. మరెన్నో చేర్పులు. పరాయి పాలకుల నీడలను పారదోలుతూ ఎన్నో కొత్త నిర్ణయాలు.. విజయాలు. అగ్రగామి దేశంగా వెలుగొందడానికి అవిరళ కృషి చేస్తున్న సమయాన మన భరతమాత మెడలోని హారంలో మరో కొత్త సుమం చేరుతోంది.

అదే సెంట్రల్ విస్టా ఆవరణలో శోభాయమానంగా రూపుదిద్దుకున్న నూతన పార్లమెంటు భవనం. వివిధ రాష్ట్రాల కళల సమాహారంగా రూపుదిద్దుకున్న ఈ రాజ్యాంగ నిలయాన్ని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన శుభ తరుణాన జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. త్రికోణాకారంలో రూపుదిద్దుకున్న ఈ మహాకృతి నిర్మాణానికి సంకల్పించిన శ్రీ నరేంద్ర మోదీకి, బీజేపీ నాయకత్వానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరూ చరితార్ధులుగా భావిస్తున్నాను.’’ అంటూ ట్వీట్‌లో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Read more:

స్టార్ డైరెక్టర్ వల్ల పవన్ కల్యాణ్- రేణుదేశాయ్ విడిపోయారా? బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్

‘బ్రో’ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ టైమ్ ఫిక్స్


Next Story

Most Viewed