- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ ప్రాంత రైతుల దశ మార్చాలన్నది మా సిద్ధాంతం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: సాగునీటితో రాయలసీమ రైతుల దశ మార్చాలన్నది మా సిద్ధాంతం అని సీమ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా (Ananthapuram District) పర్యటనలో భాగంగా.. ఉరవకొండ నియోజకవర్గం, ఛాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమ రైతుల దశ మార్చాలనేదే మా సిద్దాంతం అని, ఇందులో భాగంగానే ఆనాడు ఎన్టీఆర్ (NTR) హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు (Hnadri Niva Sujala Srvanthi Project)ను తలపెట్టారని తెలిపారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి కరువు నేలకు నీరిచ్చామని, గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ పట్టాలెక్కాయని చెప్పారు.
అంతేగాక ఈ ప్రాజెక్టును నిర్దేశిత కాలానికి ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించానని అన్నారు. ఇక ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, 81 మండలాల్లో 33 లక్షల మందికి తాగునీటి సరఫరాకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. సీమలో కీలకమైన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేస్తామని, సాగునీరు, డ్రిప్ సబ్సిడీలు ఇచ్చి రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.