వారి అకౌంట్లోకి రూ.24 వేలు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త

by Disha Web Desk 4 |
వారి అకౌంట్లోకి రూ.24 వేలు.. ఏపీ ప్రభుత్వం శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లబ్ధిదారుల అకౌంట్‌లో నేరుగా డబ్బులు జమ చేస్తోంది. ఈ నెల 23న వైఎస్సార్ నేతన్న హస్తం నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. కృష్ణా జిల్లా పెడనలో జరిగే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం డబ్బులను లబ్ధిదారుల అకౌంట్ లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద రూ.24 వేలు లబ్ధిదారుల అకౌంట్ లో జమ కానున్నాయి.

నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ప్రతి ఏటా రూ.24 వేలు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడు చేనేత సంఘంలో నమోద చేసుకుని ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికే మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.


Next Story

Most Viewed