కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం

by Disha Web Desk 22 |
కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం, ఏపీలోనూ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. దేశంలో దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. జవహర్ లాల్ నెహ్రూ వేసిన పునాదులతో రాష్ట్రంలో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం వల్ల ప్రజలందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారని వెల్లడించారు. ఇందిరా గాంధీ వారసులైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు కొడుతుంటే బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed