జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర..

by Dishanational4 |
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర..
X

దిశ, ఉత్తరాంధ్ర: డిసెంబర్ 9న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పాదయాత్ర ప్రారంభించి అనకాపల్లి వరకు యాత్రను కొనసాగించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. యలమంచిలి నియోజకవర్గ ఇంచార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర ద్వారా ఈ మార్గంలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకునే విధంగా యాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ ద్వారా నష్టపోతున్న బాధితులకు నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. రోడ్డు పూర్తిగా గోతులమయం కావడంతో ప్రజలు పడే ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలమంచి నియోజకవర్గ ప్రజలంతా పార్టీలకు అతీతంగా పాల్గొని సంఘీభావం తెలిపి.. సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలిసే విధంగా పాలుపంచుకోవాలని కోరారు. నేడు అచ్యుతాపురం జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

బీజేపీతో టీడీపీ పొత్తు.. మోడీతో బాబు మాటామంతి సంకేతమిదేనా?


Next Story

Most Viewed