- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ సమస్యలపై పాదయాత్ర చేస్తాం: దేవినేని ఉమా
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ పాలనకు వ్యతిరేకంగా రోడ్ల బాగు చేయాలని కోరుతు జూన్ 25 నుంచి పాదయాత్ర చేపడతానని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దుగ్గిరాలపాడు నుంచి జి.కొండూరు వరకు పాదయాత్ర చేస్తామని తెలిపారు. మంగళవారం ఉమా మీడియాతో మాట్లాడారు. అధ్వాన్నంగా మారిన దుగ్గిరాలపాడు-జి.కొండూరు రోడ్డు.. మరమ్మతుపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. గుంతల మయమైన రోడ్లు కారణంగా ఏడు గ్రామపంచాయతీల ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆసుపత్రులు నరక ప్రాయంగా మారాయని ఆరోపించారు. కనీస వసతులు, పరికరాల మరమ్మత్తులకు నిధుల కేటాయించడం లేదని మండిపడ్డారు. దశాబ్ధాలుగా సేవలందిస్తున్న వైద్య వ్యవస్థను మూడేళ్లలో జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. వెయ్యి దాటితే దేశంలో ఎక్కడైనా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పిన సీఎం ఎంత మొత్తం చెల్లించారో శ్వేతపత్రం విడుదల చెయాలని దేవినేని డిమాండ్ చేశారు.