పేరుకే సచివాలయం.. అందుబాటులో లేని సిబ్బంది

by Jakkula Mamatha |   ( Updated:2025-05-03 13:09:07.0  )
పేరుకే సచివాలయం.. అందుబాటులో లేని సిబ్బంది
X

దిశ, పోరుమామిళ్ల: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశాన్ని సచివాలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని కచ్చితంగా సమయపాలన పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. కానీ క్రింది స్థాయి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని పోరుమామిళ్ల 1 సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు ఒక గ్రామ రెవెన్యూ అధికారి తప్ప మిగిలిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. మిగిలిన సిబ్బంది ఎక్కడికి వెళ్లారని అడిగితే భోజనానికి వెళ్లి, ఇంకా రాలేదని చెప్పడంతో.. సచివాలయ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.



Next Story