Yemmiganur: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా

by Disha Web Desk 16 |
Yemmiganur: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా
X

దిశ, ఎమ్మిగనూరు : రాష్ట్రనైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, రావుస్ డిగ్రీ కళాశాల వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు హెటిరో డ్రగ్స్, హీల్ మై ఫ్యామిలీ, అమర్ రాజా బ్యాటరీస్, అరబిందో ఫార్మా, నవభారత్ ఫర్టిలైజర్స్, ఫ్లిప్ కార్ట్, డి మార్ట్, శ్రీరామ్ చిట్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మహేంద్ర హోం ఫైనాన్స్, మేడిప్లస్ ఫార్మసీ, సీటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్‌ కే బయో ఎంటర్ప్రైజెస్, స్పందన, స్ఫూర్తి, వివిధ కంపెనీలలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, జీజీ, ఐ.టి.ఐ, డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, బి.టెక్ అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పిలుపు నిచ్చారు. వయసు 18 సం.రాల నుండి 35 సం.రాల లోపు వయస్సు కలిగిన హాజరుకాగలరు. సెలెక్ట్ అయిన అభ్యర్ధులందిరికి వార్షిక జీతం 1,50,000/- రూపాయల నుంచి 3,5000/- రూపాయల వరకు జీతం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.

సెప్టెంబర్ 12న (ఆదివారం) నిరుద్యోగులు బయోడేటా, సర్టిఫికేట్‌లతో ఇంటర్వ్యూకు ఎమ్మిగనూరు రావుస్ డిగ్రీ కళాశాలకు రాగలరు. అర్హత కలిగిన అభ్యర్థులు www.apssdc.in లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. మరిన్ని వివరాల కోరకు "9985496587, 7799494856, 7799921656" నంబర్లను సంప్రదించగలరని రావుస్ కళాశాల సీఈఓ తిరుమలరెడ్డి తెలియజేశారు.

Next Story

Most Viewed