కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

by Disha Web Desk 16 |
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిరప కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోజూ మాదిరిగా కూలీలు పనులకు వెళ్లి వస్తుండగా చెప్పిగిరి మండలం హత్తి బెలగల్ సమీపంలో ఆటో టైర్ పగిలి ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed