రెండు గంటల్లో రెండు పార్టీలు మారిన యువకులు.. అవాక్కైన నాయకులు

by srinivas |
రెండు గంటల్లో రెండు పార్టీలు మారిన యువకులు.. అవాక్కైన నాయకులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార, పత్రిపక్ష పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశాయి. ఈ మేరకు నాయకులు, యువకులు వారికి నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. అయితే కర్నూలు జిల్లా నంద్యాలలో మాత్రం నాయకులకు యువకులు షాక్ ఇచ్చారు. నంద్యాల 12వ వార్డుకు చెందిన యువకులు ఈ రోజు ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమీపంలో ఫ్యాన్ గూటికి చేరారు. అయితే అది జరిగిన రెండు గంటల్లోనే మనసు మార్చుకున్నారు. చొక్కాలు, టీ షర్టులు మార్చుకుని మధ్యాహ్నానికి కల్లా తెలుగుదేశం పార్టీ నేత ఫిరోజ్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకులు అవాక్కయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నాయకులకు యువకులు భలే షాక్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Next Story

Most Viewed