రూ.30 కోట్లు మళ్లింపు.. వెలుగులోకి ఎన్నారై ఆస్పత్రి అక్రమాలు

by Disha Web Desk 16 |
రూ.30 కోట్లు మళ్లింపు.. వెలుగులోకి ఎన్నారై ఆస్పత్రి అక్రమాలు
X

దిశ వెబ్ డెస్క్: విజయవాడ ఎన్నారై మెడికల్ కాలేజీ నుంచి రూ. 30 కోట్లు దారి మళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. నిన్నటి నుంచి మొత్తం 27 గంటలపాటు ఆస్పత్రిలో సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. ఎంబీబీఎస్, పీజీ సీట్లకు సంబంధించిన ఫీజులను మళ్లించినట్లు తేలింది. పన్ను రాయితీల కోసం ఎన్నారైలు ఇచ్చిన విరాళాలను ఆస్పత్రి డైరెక్టర్ డ్రా చేసినట్లు వెల్లడైంది. కోవిడ్ రోగుల వివరాలు రికార్డుల్లో చేర్చకుండా నిధులు దారి మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 1500 మందికి పైగా రోగుల నుంచి వసూలు చేసిన రూ. 30 కోట్లను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. మూడు బ్యాగుల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story