Vijayawada: ఎర్రటి ఎండలో ఊహించని ప్రమాదం.. హడలిపోయిన జనం

by Disha Web Desk 16 |
Vijayawada: ఎర్రటి ఎండలో ఊహించని ప్రమాదం.. హడలిపోయిన జనం
X

దిశ, డైనమిక్ బ్యూరో: విజయవాడ అజిత్‌సింగ్ నగర్ హెచ్‌పీ పెట్రోల్ బంకు వద్ద ఆటో దగ్గరమైంది. ఆటో వెళ్తుండగా దాని నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆటో డ్రవర్ ఇతరులు దాన్ని నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా జరగడంతో ప్రజలు స్థానికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. దీంతో బంకు యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ శాఖ మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆటో దగ్ధమైనట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.



Next Story