కుల కుంపట్లు పెట్టారు..Cm Jaganపై కేంద్రమాజీ మంత్రి ఫైర్

by Disha Web Desk 16 |
కుల కుంపట్లు పెట్టారు..Cm Jaganపై కేంద్రమాజీ మంత్రి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ కార్పొరేషన్ పేరుతో కులాలు మధ్య చిచ్చుపెట్టారంటూ మండిపడ్డారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుబాటి పురంధేశ్వరి బీసీలకు ఏదో చేశామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కారణం నందమూరి తారక రామారావు అని పురంధేశ్వరి గుర్తు చేశారు. అలాగే బీసీలకు గౌరవం ఇచ్చి దేశ ప్రధానిని చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాయమాటలతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. వైసీపీ బీసీ కార్పొరేషన్‌లను ప్రారంభించటమే కాదని.. నిధులు కేటాయించాలని సూచించారు. బీసీలను కులాల వారీగా విడదీసిన వైసీపీ కుల కుంపట్లు పెడుతోందని విమర్శించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూస్తే .. బీజేపీ ప్రభుత్వం మాత్రమే మైనార్టీలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయడం జరిగిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు.

Read more:

వార్ కోసం 'వారాహి' రెడీ.. యుద్ధానికి సిద్ధమవుతున్న జనసేనాని Pawan Kalyan


Next Story

Most Viewed