విద్యుత్ షాక్‌తో ఏపీ ఫైబర్ కేబుల్‌ వర్కర్ మృతి

by srinivas |
విద్యుత్ షాక్‌తో ఏపీ ఫైబర్ కేబుల్‌ వర్కర్ మృతి
X

దిశ, నూజివీడు: ఏపీ ఫైబర్ కేబుల్‌లో వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం నూజివీడు మండలం గొల్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన అంకెం రాజేష్ (36) ఎప్పటిలాగానే కేబుల్ వర్క్ చేస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నూజివీడు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed