- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Home > ఆంధ్రప్రదేశ్ > కేసీఆర్, జగన్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారు : మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
కేసీఆర్, జగన్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారు : మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
by Disha Web Desk 21 |

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ తదితర అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ ఇద్దరు కుమ్మక్కై చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్కు తెలియకుండా వైఎస్ జగన్ ఏమీ చేయలేరని అన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం సూట్ కేసులను పంపించారని మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఈ మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.
Read More..
Next Story