ఆపరేషన్ సిందూర్ లో జవాన్ వీరమరణం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ట్వీట్

by Ramesh Goud |
ఆపరేషన్ సిందూర్ లో జవాన్ వీరమరణం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సిందూర్ (Operation Sinddor) లో ఆంధ్రప్రదేశ్ వాసి అయిన భారత జవాన్ మురళీ నాయక్ వీర మరణం (Jawan Murali Naik Died) పొందారు. ఈ సందర్భంగా అమరవీరుడు మురళీ నాయక్ కు పలువురు ప్రముఖులు నివాళులు (Tribute) అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో జవాన్ మరణంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన.. ఆపరేషన్ సిందూర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతా ఎన్నడూ మరిచిపోదని అన్నారు. అలాగే జమ్ము కశ్మీర్ సరిహద్దులో శత్రు మూకలతో పోరాడి వీర మరణం పొందినే భారత జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమరభూమిలో అమరుడయ్యారు. ఈ వీరుడి తల్లిదండ్రులు జ్యోతీ బాయికి, శ్రీరామ్ నాయక్ కి, ఇతర కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాక ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed