2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్ : చంద్రబాబు నాయుడు

by Disha Web Desk 21 |
2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్ : చంద్రబాబు నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2047 నాటికి ప్రపంచంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం కేవలం భారతదేశానికి మాత్రమే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలనేదే తన కోరిక అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసేందుకు తన వంతు ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలు ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులకు సైతం కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. మీరు సంపాదించిన దాంట్లో 5 శాతాన్ని సమాజం కోసం వినియోగించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రిగా తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. తాను చేసిన పనులను భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకుంటే తన జన్మ ధన్యమైనట్టేనంటూ చెప్పుకొచ్చారు. యువత టీడీపీకి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి అయ్యానంటే అందులో కీలక పాత్ర విద్యార్థులు, యువతేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed