- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇండియా–పాక్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
by Jakkula Mamatha |

X
దిశ, డైనమిక్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కంట్రోల్ రూమ్ నెంబర్లు: 011-23387089, 9871999430, 9871999053, 9871990081, 9818395787 అని వెల్లడించింది. రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి.. ఏపీ భవన్ కృషి చేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఏపీ విద్యార్థుల కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలను ప్రారంభించింది. ఢిల్లీలో, సరిహద్దు రాష్ట్రాల్లో లక్షల్లో తెలుగు వారు నివసిస్తున్నారు. వారి క్షేమ సమాచారాన్ని కనుక్కునేందుకు ఈ నెంబర్ ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Next Story