- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ఆ ఘటన గురించి విని షాకయ్యాను’.. మాజీ సీఎం సంచలన ట్వీట్

దిశ,వెబ్డెస్క్: జమ్మూ కాశ్మీర్(Jammu Kashimr)లో పహల్గాంలో టూరిస్టుల పై జరిగిన ఉగ్రదాడి ఘటనను ఏపీ మాజీ సీఎం, వైసీపీ నేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం జమ్మూకాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసిన ఘటన దేశాన్నే కుదిపేసింది. ఈ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. అక్కడికి వెళ్లిన టూరిస్టులను మతం గురించి అడిగి మరీ ముష్కరులు కాల్చి చంపారు. ఈ అమానుష ఘటన పై మాజీ సీఎం జగన్(Former CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి విని షాకయ్యానని తెలిపారు. ఈ పిరికిపందల హింసాత్మక చర్యలను వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పర్యాటకులను అమానవీయంగా చంపేశారని అన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని మాజీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా కోరారు.