Vinukonda: ప్రజా ద్రోహి ఎమ్మెల్యే బొల్లా: జీవీ ఆంజనేయులు

by Disha Web Desk 16 |
Vinukonda: ప్రజా ద్రోహి ఎమ్మెల్యే బొల్లా: జీవీ ఆంజనేయులు
X

దిశ, వినుకొండ: అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రజా ద్రోహి ఎమ్మెల్యే బొల్లా అని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజేయులు ఆరోపించారు. తెలుగు పార్టీ నాయకులు వినుకొండ మండలం కొప్పుకొండ తండాలో ‘భవిష్యతుకు గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. నిత్యావసర ధరలు , జగన్‌ నాలుగేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 57 వేల కోట్లకు పైగా భారం మోపారని ఆరోపించారు. ఆర్టీసీ చార్జీలు పెంచుకుపోతూ ప్రజలపై భారం మోపుతున్నాన్నారు. వైసీపీ ప్రభుత్వ రాజకీయ కక్ష, రాక్షస పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని, రానున్న ఎన్నికల్లో సైకో జగన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడతారని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.

Next Story

Most Viewed