Amaravati: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా

by srinivas |
Amaravati: ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా పడింది. విశాఖకు ప్రభుత్వం కార్యాలయాలు తరలించాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అడుగులు వేస్తూ జీవో తీసుకొచ్చింది. అయితే ఈ జోవోను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ జీవోను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారని.. అందువల్ల విచారణకు అర్హం కాదని, ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని హైకోర్టుకు దృష్టికి ఏజీ శ్రీరామ్ తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మసనం ఈ నెల 8కు విచారణను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.



Next Story

Most Viewed