- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Cm Jaganను ఫాలో అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే.. తాజాగా సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఇక రాజకీయాల్లో వెంట్రుక పీకలేరు అనే పదం తెగ హల్చల్ చేస్తోంది. తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ నేతలు ఒకరిపై మరోకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదే బాట పట్టారు. అందరూ పీకలేరు అంటున్నప్పుడు తానేందుకు అనకూడదనుకున్నారో ఏమో వైసీపీ బహిరంగ సభలో ఆయన కూడా ప్రతిపక్షాలు తన వెంట్రుక కూడా కదల్చలేవు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా మాచర్లలో జరిగిన వైసీపీ సభలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కీలక ప్రసంగం చేశారు. '2019లో ఒక అభ్యర్థిని నాపై పోటీకి చంద్రబాబు నిలబెట్టారు. 2014లో ఒక వ్యక్తిని నిలబెట్టారు. 2009లో వేరే వ్యక్తిని నిలబెట్టారు. ఇప్పడు 2009లో వ్యక్తినే పోటీకి దింపుతారంట. బ్రహ్మానందం రెడ్డి వచ్చినా, మధుబాబు వచ్చినా, చలమారెడ్డి వచ్చినా..అంజి రెడ్డి వచ్చినా.. తమ వెంట్రుక కూడా పీకలేరని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికకు వైసీపీ మెజార్టీ పెరుగుతుందే కానీ తగ్గదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదన్నారు. తనపై ఓడిపోయిన అభ్యర్థులు నలుగురు వచ్చి పోటీ చేసినా పర్వాలేదని చెప్పారు. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలు పల్నాడులో చర్చనీయాంశం అయ్యాయి.
ఇవి కూడా చదవండి: