Guntur: ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణ హత్య

by Disha Web Desk 16 |
Guntur: ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణ హత్య
X

దిశ వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఎంబీబీఎస్ విద్యార్థిని దారుణ హత్యకు గురయ్యారు. ఐటీ ఉద్యోగి జ్ఞానేశ్వర్ సర్జికల్ బ్లేడుతో దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్థిని మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ విద్యార్థిని మృతి చెందారు. విద్యార్థినిపై దాడి అనంతరం జ్ఞానేశ్వర్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బ్లేడుతో చేయి కోవడంతో జ్ఞానేశ్వర్‌ను గాయమైంది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed