ఉపాధి పనులు ముమ్మరం

by Jakkula Mamatha |
ఉపాధి పనులు ముమ్మరం
X

దిశ, కారంపూడి: ఉపాధి హామీ నూతన వార్షిక ఏడాది ప్రారంభమైంది. కూలీలకు అధికంగా పని దినాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో కూలీలకు ఊరట లభిస్తుంది. వ్యవసాయ పనులు తక్కువగా ఉండే వేసవిలో కూలీలకు పని కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి కనీసం వంద రోజుల పాటు పని కల్పిస్తున్నారు. వాన నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలను పెంచేందుకు నీటి కుంటల నిర్మాణం చేపడుతున్నారు. రోజుకు కనీసం దినసరి కూలీ లభించేలా అవగాహన కల్పిస్తున్నారు.

కారంపూడి మండలంలో 15 పంచాయతీలు ఉండగా.. మండలంలో మొత్తం 11,794 జాబ్ కార్డులు ఉండగా యాక్టివ్ జాబ్ కార్డులు 7981 ఉన్నాయి. 12783 మంది కూలీలు పంట పొలాలకు ఉన్న జాయింట్ కాలువల పూడిక పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు కలిపి గత సంవత్సరం 2024-25కు గాను 2,38,354 లక్షల పని దినాలు కల్పించగా ఈ సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 22000 వేల పని దినాలు కల్పించారు. గ్రామాల్లో కాల్వల పూడికతీత, భూమి చదును,కందకాలు, పశువుల పాకలు, గొర్రెల పాకల నిర్మాణం చేపడుతున్నారు. వేసవి దృష్ట్యా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు కూలీలు పనులు ముగించుకొని తిరిగి ఇళ్లకు చేరుకోవాలని సంబంధిత అధికారులు కూలీలకు సూచిస్తున్నారు.

నిర్ణీత కొలతల ప్రకారం పనిచేసి కనీస వేతనం పొందాలని అవగాహన కల్పిస్తున్నారు. ఏపీఓ రేఖా జ్యోతి నీ దిశ పత్రిక రిపోర్టర్ వివరణ కోరగా మాట్లాడుతూ సంవత్సరానికి ఒక కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పిస్తున్నాం మన్నారు.కూలీలకు వేసవి కాలం దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నాం. అని అన్నారు. నీడలేని చోట నీడ సౌకర్యం కల్పిస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.



Next Story

Most Viewed