- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం జగన్పై దాడి కేసు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్పై దాడి కేసులో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ దాడి అంశం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. సీఎం జగన్పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు బయటకు వస్తాయని చెప్పారు. సీఎం జగన్ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమానా.. ?.. ఆయన కంటే పెద్ద వాళ్లా అన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. ఈ కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ దాడిపై పవన్ కల్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధరహితమని సజ్జల కొట్టిపారేశారు.






