మాజీ మంత్రి గంటాకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు టికెట్ కన్ఫామ్...!

by Disha Web Desk 16 |
మాజీ మంత్రి గంటాకు గుడ్ న్యూస్.. ఎట్టకేలకు టికెట్ కన్ఫామ్...!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలీ టికెట్ ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి ఆయన అధిష్టానం పోటీ చేయమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే అక్కడి నుంచి పోటీ చేయనని.. భీమిలీ టికెట్ ఇవ్వాలని కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానాన్ని గంటా శ్రీనివాసరావు కోరుతూ వచ్చారు. అయితే టీడీపీ మూడు లిస్టులు విడుదలైనా ఆయన టికెట్ కేటాయించలేదు. ఇంకా కొన్ని సీట్లకు అభ్యర్థుల ఖరారును అధినేత చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. అయితే గంటాకు భీమిలీ టికెట్ కేటాయించినట్లు ఆయన వర్గం చెబుతోంది. టీడీపీ నాలుగో జాబితాలో గంటా పేరు కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు గంటాకే సీటు కన్పామ్ అయినట్లు సోషల్ మీడియాలోనూ ప్రచారం జరుగుతోంది. దీంతో చీపురుపల్లి సీటు కోరుకుంటున్న సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. చీపురుపల్లి సీటు కళా వెంకట్రావుకే నంటూ ఆయన వర్గం చెప్పుకుంటోంది. చూడాలి ఏం జరుగుతుందో...!


Next Story

Most Viewed