- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధమైన బస్సు

దిశ, వెబ్ డెస్క్: అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన విజయవాడ బస్టాండ్ (Vijayawada Bus Stand) సమీపంలో చోటు చేసుకుంది. ఘటన ప్రకారం విజయవాడలో ఏవీఆర్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేట్ బస్సు (Private Bus) బస్టాండ్ వద్దకు రాగానే ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపివేసి బస్సు నుండి దూరంగా పరుగులు తీశాడు. మంటలు నెమ్మదిగా బస్సు మొత్తానికి వ్యాపించి అందరూ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై సమాచారం అందుకు ఫైర్ సిబ్బంది (Fire Staff) సంఘటనా స్థలానికి చేరుకునే లోపే బస్సు మంటల్లో కాలి బూడిదైంది. మంటలు చెలరేగే సమయానికి బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. షార్ట్ సర్క్యూట్ (Short Circute) వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు.