పశువుల కోసం వెళ్లి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్న తండ్రి, కొడుకు

by Disha Web Desk 2 |
పశువుల కోసం వెళ్లి.. ప్రాణాలమీదకు తెచ్చుకున్న తండ్రి, కొడుకు
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా ఓజిలి మండలం గ్రద్దగుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగి తండ్రికొడుకు మృతిచెందారు. చెరువులోకి గేదెలను పంపి.. యువకుడి తండ్రి బురదలో ఇరుక్కున్నాడు. తండ్రికోసం బురదలోకి వెళ్లిన యువకుడు బయటకు లాగడానికి ప్రయత్నించి తాను కూడా బురదలో చిక్కుకున్నాడు. ఈ క్రమంలో ఊపిరాడక ఇద్దరు మరణించారు. గమనించిన స్థానికులు యువకుడ్ని మృతదేహం వెలికితీశారు. తండ్రి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి మృతదేహాన్ని వెలికితీసేందుకు యత్నిస్తున్నారు.


Next Story

Most Viewed