ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ సక్సెస్

by Disha Web Desk 16 |
ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ సక్సెస్
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వైద్యం అందించే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయ్యిందని రాజ్యసభ సభ్యులు, విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్రయల్ రన్‌లో భాగంగా కేవలం మూడు నెలల్లో 27 లక్షల మందికి వైద్య సేవలందినట్లు తెలిపారు. 104 వాహనంతో పాటు డాక్టర్ ఇతర వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వైద్యసేవలందిస్తున్నారని అన్నారు. వివిధ రకాల వ్యాధులకు సంబందించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. 30 ఏళ్లు దాటిన వారిలో 92% మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింది 330.15 కోట్ల నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమచేసారని తెలిపారు. 3,30,145 మందికి వరుసగా మూడో ఏడాది లబ్ధి చేకూరిందని అన్నారు. దుఖానాలు ఉన్న దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు చేదోడు కింద ఏటా రూ.10000 జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నాబా కిషోర్ దాస్ హత్యకు గురైన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతితో కలిసి ఈ సంఘటలనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసినట్లు తెలిపారు.


Next Story