- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Ap News: సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగన్

దిశ, ఏపీ బ్యూరో: వెనుకబడిన కులాలకు జరుగుతున్న మేలుని చూసి చంద్రబాబుకు కళ్ల సమస్య వచ్చిందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. కాకినాడ రూరల్, విశాఖ జిల్లా గాజువాకలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కాకినాడ ఏరియాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సొంత మామని మోసం చేసి పార్టీ లాక్కుని ప్రజలను, వెనుకబడిన కులాలను పట్టించుకోకుండా అన్యాయం చేసినట్లు ఆరోపించారు. రామోజీరావు, పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి తోడుగా ఉంటే జగన్ అన్నకి మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అండగా ఉన్నట్లుపేర్కొన్నారు. చంద్రబాబు ఆడుతున్నది నాటకం. అందుకే ‘ఆపు బాబు నాటకం - జగనన్నే మా నమ్మకం’ అంటూ హుషారుగా వస్తున్న పాటని ప్రజలతో కలిసి పాడారు. సభలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, తానేటి వనిత, కాకినాడ ఎంపీ వంగ గీతా, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, ఎమ్మేలేలు కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతూ 6500 హామీలను తుంగలో తొక్కిన పార్టీ టీడీపీ అయితే, మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత వైసీపీదని గుర్తు చేశారు. టీడీపీ వాళ్లకు దృష్టి లోపం వల్ల ఒక సామాజిక వర్గమే కనిపిస్తోందని చెప్పారు. వారి కోసమే పదవులు, కాంట్రాక్టులు దక్కేలా చంద్రబాబు చూసేవారని ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్లో రూ. 800 కోట్లను ఓ లక్షకు పైగా లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు.
గోదావరి జిల్లాల వాసులు చాలా తెలివైనోళ్లు..
ఎవరైనా సొంత పార్టీ కోసం పోరాడతారని, కొందరు మాత్రం పక్క పార్టీ గెలవాలని పార్టీ పెట్టారంటూ పవన్ కళ్యాణ్కు చురకలు అంటించారు. గోదావరి జిల్లా ప్రాంత వాసులు చాలా తెలివైన వాళ్లని, ఇలాంటి వాళ్లను అంత తేలిగ్గా నమ్మరని చెప్పారు. ఒక టీడీపీ మంత్రి ఒకప్పుడు బీసీలకు మంత్రి పదవులు ఎందుకన్నారని, అలాంటిది ఈ రోజువెనుకబడిన కులాలకు ఎన్నో మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాజు ఇచ్చారని తెలిపారు. బలంగా ఉంటేనే పొత్తులు పొడుస్తాయని మంత్రి తానేటి వనిత ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని గుంపులు వచ్చినా ఆయన మాత్రం సింగిల్గా వస్తారని తెలిపారు. చరిత్రలో మనం క్రీస్తు పూర్వం అని ఎలా మాట్లాడుకుంటామో, ఆంధ్ర ప్రదేశ్ పాలనలో జగన్ అన్న ముందు, జగన్ అన్న తరువాత అని చెప్పుకుంటారని ఆమె పొగడ్తల వర్షం కురిపించారు.