- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అభ్యర్థిని నేనే.. పోటీ చేసేది నేనే: వరుపుల సుబ్బారావు

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నుంచి తానే పోటీ చేస్తానని వైసీపీ ఇంచార్జి వరుపుల సుబ్బారావు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి వైసీపీ అధినేత జగన్కు గిఫ్ట్ ఇస్తానని ఆయన తెలిపారు. తనపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు, కార్యకర్తలు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే వారికి ఈపాటికే బీపీలు వచ్చే ఉంటాయని వరుపుల సుబ్బారావు ఎద్దేవా చేశారు.
కాగా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఉన్నారు. నియోజకవర్గంలో సీఎం జగన్ చేయించిన సర్వేల్లో ఆయనపై వ్యతిరేకత తేలింది. దీంతో ప్రతిపాడు ఇంఛార్జిగా వరపుల సుబ్బారావును నియమించారు. దీంతో నియోజకవర్గం వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వరుపులకు ఇంచార్జి బాధ్యత ఇవ్వడంపై పూర్ణచంద్రప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీటు కేటాయిస్తే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తామని అంటోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విజయానికి సహకరించమని హెచ్చరించారు. ప్రతిపాడులో వరుపుల ఓడిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ చంద్రప్రసాద్ వర్గంపై ఇంచార్జి వరుపుల సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడులో కచ్చితంగా గెలిచి తీరతానని వరుపుల సుబ్బారావు దీమా వ్యక్తం చేస్తున్నారు.